అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని పులగుట్టపల్లి గ్రామానికి చెందిన గుండె శ్రీనివాసులు అనే కౌలు రైతు అప్పుల బాధ తాళలేక చింత చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు మండలంలోని పులగుట్టపల్లికి శ్రీనివాసులు భూమి కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసేవాడు. పంటల సాగుకు తెలిసిన వారి వద్ద భారీగా అప్పులు చేశాడు. పంటలు పండక చేసిన అప్పులు, వడ్డీ ఎలా చెల్లించాలని మదనపడే వాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది శ్రీనివాసులు గురువారం గ్రామ శివారులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.