నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా గతంలో 23న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా లో ఎంపికైన అభ్యర్థులను ఆదివారం రాత్రి టాటా కంపెనీకి చెందిన మేనేజర్ సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు, హోసూరు వద్ద టాటా కంపెనీ ఉందన్నారు, ఎంపికైన అభ్యర్థులు అక్కడికి తీసుకువెళ్లి రేపు ఉదయము డ్యూటీలో జాయిన్ చేయడం జరుగుతుంది అని తెలిపారు, మరి కొన్ని రోజుల తర్వాత రెండో బ్యాచ్ ని తీసుకు వెళ్ళడం జరుగుతుంది అని తెలిపారు, పోలీసు బందోబస్తు నడమ విద్యార్థులను కంపెనీకి తీసుకుని వెళ్లారు