బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్లో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఒక ప్లైవుడ్ షాపుతో పాటు రెండు స్టీల్ షాపులలో దొంగతనం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించి శుక్రవారం వివరాలు సేకరిస్తున్నారు. ఎంత మేరకు నగదు లేదా వస్తువులు అపహరించారన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.