నెల్లికుదురు: తెగిపోయిన చెరువు కట్ట మరమత్తు పనులు చేయించాలని ఆలేరు గ్రామంలో రోడ్డుపై బైఠాయించి రైతుల రాస్తారోకో
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు (మ) ఆలేరు స్టేజి వద్ద ఆలేరు గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. తమ గ్రామంలో తెగిపోయిన చెరువుకట్ట మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలంటూ రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా నిర్వహించారు. వర్షా కాలంలో గండి పడిన చెరువును ఇంతవరకు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి చెరువును బాగు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.