పలమనేరు: పట్టణంలో నియోజకవర్గ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి స్థానిక వెలుగు కార్యాలయంలో DLDO కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎల్డిఓ కార్యాలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం అధికారులతో పలు విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ స్థాయి అధికారులు ఎంపీడీవోలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.