శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం ఎర్రగుంట్ల పల్లెలో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మామిడి తోటలో పనిచేస్తుండగా నారాయణరెడ్డి అనే రైతుకు నాగుపాము కాటు వేయడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నారాయణరెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు.