గుంతకల్లు: పామిడి మండలం రామగిరి ఎగువ తండా గ్రామంలో ఉద్రిక్తత, రుణాలు ఎగ్గొట్టి ఏడాది తర్వాత గ్రామానికి వచ్చిన మహిళ
అనంతపురం జిల్లా పామిడి మండలంలోని రామగిరి ఎగువతండా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పామిడి మండలంలోని ఎగువ తండా గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ గ్రామంలోని కళ్యాణి మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉంటూ గత ఏడాదిలో లక్ష రూపాయలు ఋణం తీసుకుంది. అంతేకాకుండా గ్రామంలో కొంతమందితో లక్షలలో అప్పుగా డబ్బు తీసుకొని ఊరు వదిలి పోయింది. భర్తపై కూడా వరకట్నం వేధింపుల కేసు పెట్టి వెళ్ళి వెళ్ళి పోయింది. అయితే ఏడాది కాలంగా ఆమె ఊరికి దూరంగా ఉండేది. అయితే పామిడి పోలీసు బందోబస్తుతో గ్రామానికి రాగా ఉద్రిక్తత నెలకొంది.