సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కేంద్రంలో బుధవారం 12 గంటల సమయంలో కనగానపల్లి టిడిపి నేతలు కనగానపల్లి రైతు సత్యనారాయణ అరటి తోటను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రైతు సత్యనారాయణ మాట్లాడుతూ తనకు చెందిన రెండు ఎకరాల్లో అరటి సాగును చేయడం జరిగిందని అయితే మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తి తెలియని వ్యక్తులు 200 వరకు అట్టి చెట్లను నరికి వేయడం జరిగిందని ఈ సంఘటన పైన స్థానిక పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా టిడిపి నేతలు మాట్లాడుతూ ఇలాంటి సంస్కృతి కనగానపల్లి మండలంలో లేదని ఇలాంటి వాటికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని కనగానపల్లి టిడిపి నేతలు డిమాండ్ చేశారు.