అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శారద నగర్ 1వ క్రాస్ వద్ద శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆల్ ఇండియా బంజారా సేవా రాష్ట్ర అధ్యక్షుడు చక్రి నాయక్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చక్రి నాయక్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13 14 15 తారీకు లో శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు 50 లక్షలు మాత్రమే నిధులు కేటాయించిందని ఈ నిధులు రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు వసతులు ఏర్పాటు చేసేందుకు కూడా సరిపోవని కోటి రూపాయలు నిధులు విడుదల చేయాలని చక్రి నాయక్, శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు.