అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో హార్ట్ ప్రైమరీ పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల సమయంలో ఎస్టి జోసెఫ్ ఫౌండేషన్ సిస్టర్ పుష్ప స్వరూప రాప్తాడు పోలీసులు విద్యార్థినిలకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిస్టర్ పుష్ప స్వరూప స్థానిక పోలీసులు మాట్లాడుతూ విద్యార్థినీలు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని చిన్నప్పటినుంచి రోడ్డు భద్రతను పాటించడం వల్ల ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయని తల్లిదండ్రులు కూడా ఈ రోడ్డు భద్రతల గురించి వివరించాలని ఎస్టి జోసెఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు సిస్టర్ పుష్ప స్వరూప పోలీసులు పేర్కొన్నారు.