అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ శారద నగర్ లో ఉన్న శివకోటి శ్రీ పీఠం ఆలయమునందు ఆదివారం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుంచి 8:30 గంటల వరకు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆలయ నిర్వాహకుడు అప్పు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శివకోటి శ్రీ పీఠం ఆలయ నిర్వాహకుడు అప్పు స్వామి మాట్లాడుతూ ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం ప్రత్యేకంగా మహిళలతో నిర్వహించి భక్తులందరికీ తీర్థప్రసాదాలను పంపిణీ చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకుడు అప్పుస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.