మంత్రాలయం: నిధులు వచ్చాయని చెబుతున్న అధికారులు తక్షణమే పెద్ద కడబూరు నుండి ఆదోని ప్రధాన రహదారి పనులను చేపట్టాలి: సీపీఐ
పెద్ద కడబూరు: మండల కేంద్రం నుండి ఆదోని ప్రధాన రహదారి పనులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ బైచిగేరి అడ్డు రోడ్డు వరకు రహదారి అస్తవ్యస్తంగా ఉందన్నారు. నిధులు వచ్చాయని చెబుతున్న అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలని వారు కోరారు.