కర్నూలు జిల్లాకోడుమూరులోని ధర్మపురి క్షేత్రానికి చెందిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తున్న సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.