కనిగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం చంద్రశేఖరపురం మండలం డీజీ పేట గ్రామానికి చెందిన 32 కుటుంబాల వారు వైసీపీని వీడి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి టిడిపి కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... డీజీ పేట గ్రామానికి మరో ఏడాదిలో అన్ని వసతులను కల్పించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలో చేరిన వారు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. చంద్రశేఖరపురం మండల టిడిపి అధ్యక్షులు రమేష్ పాల్గొన్నారు