మద్దిపాడు లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని ఎస్సై వెంకట సైదులు గురువారం గుర్తించి, వారి చేత కాళీ మద్యం సీసాలను ధ్వంసం చేయించి పరిసరాలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించమని మద్దిపాడు గ్రామస్తుల చేత ఎస్సై వెంకట సైదులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... మద్దిపాడు మండలంలో ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.