ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం మరియు అన్ని ఎన్ఆర్ఈడిసిఏపి ప్రాజెక్టులు, వివిధ పథకాలపై ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి, అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, నెడ్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబు, ఎపిఎస్పిడిసిఎల్ డైరెక్టర్ పి.అయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.