ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలలో మహా శివరాత్రి సందర్భంగా సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కని దైవ దర్శనం కలిగేలా మహా శివారాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని విసి హాల్ నుండి జిల్లా కలెక్టర్ రాజబాబు, రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖ అధికారులతో వర్చువల్ గా సమావేశమై ఈ నెల 15న మహా శివారాత్రి సందర్భంగా జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలలో చేపట్టవలసిన మహా శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసారు.