అనంతపురం నగర శివారులోని బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామంలో రామసుబ్బారెడ్డి అతని భార్య ప్రమీల కుమార్తె జాహ్నవి కుమారుడు కార్తీక్ పై రహమతుల్లా మరియు వారి కుటుంబ సభ్యులు ఇనుప కడ్డీతో దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.