మహబూబ్ నగర్ అర్బన్: మన సంస్కృతి, సంప్రదాయాలు మన దేశ గొప్పతనాన్ని చాటుతున్నాయి : ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
భారతదేశంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి మన దేశ గొప్పతనాన్ని చాటేలా చేస్తున్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని దీప్తి శాస్త్రీయ నృత్య కళాశాల వేసవి శిక్షణా శిబిరం ముగింపు సమావేశం మహబూబ్ నగర్ పట్టణం లోని సోమవారం బాదం రామస్వామి సరోజాదేవి ఆడిటోరియం లో జరిగింది . ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతీయ సాంస్కృతి చాలా విలువలతో కూడుకున్నదని భావితరాలకు వారసత్వ సంపదగా మన సంస్కృతి సాంప్రదాయాలు అందించాల్సిన