అనంతపురం జిల్లా రాయదుర్గంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో రాయదుర్గం తాండాకు చెందిన గోపాల్ నాయక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి బుధవారం రాత్రి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.