ఉట్నూర్: సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కిన ఆదిమ కొలాం గిరిజనులు,ఉట్నూర్ ఐటిడిఏ ఎదుట మహా ధర్నా
ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటిడిఏ కార్యాలయం ఎదుట సోమవారం ఆదిమ కొలాం గిరిజనులు నిరసన తెలిపారు.మన్నెవార్లను పీవీటిజి జాబితాలో చేర్చవద్దని డిమాండ్ చేశారు. వారిని జాబితాలో చేర్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు , మహా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామన్నారు . రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొలాం గిరిజనులకు ఉన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.