అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం సమీపాన గురువారం సాయంత్రం 6:30 గంటల సమయంలో కుక్క అడ్డం వచ్చి కారు బోల్తా కారులో ప్రయాణిస్తున్న అనంతపురం నగరానికి చెందిన షాకీర్, నస్రిన్ భార్యాభర్తలు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. కొత్తచెరువు నుండి అనంతపురం టౌన్ కు కార్లో వస్తుండగా హంపాపురం సమీపాన ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.