అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని పుష్కల్ ఆగ్రో టెక్ ఎదుట మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. తమకు నాసిరకం ఎరువులు అంటగట్టి మోసం చేసారని రైతులు పేర్కొన్నారు. సుమారు రూ.8 లక్షల విలువైన పోటాష్, డిఏపిలను ను కొనుగోలు చేసామని కనేకల్లు మండలం గరుడచేడు, మీండ్లహళ్లి గ్రామ రైతులు పేర్కొన్నారు. లక్షల పెట్టుబడి వృథా అయ్యాయని నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేసారు.