కనిగిరి: పెద చెర్లోపల్లి మండలం బండ పాలెం లో మహిళ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
పెదచెర్లోపల్లి మండలం బండపాలెంలో ఏనుగంటి వెంగమ్మ అనే మహిళ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడు కాళహస్తి శంకర్ ను శనివారం అరెస్టు చేసినట్లు కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ తన కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడిని మీడియా ఎదుట హాజరు పరిచి డిఎస్పి వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ చోరీ జరిగిందని, దొరికి పాల్పడిన వారిలో ఓ నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్దనుండి బంగారు నల్లపూసల దండ, రెండు ఉంగరాలు, రెండు జతల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగిలిన నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామన్నారు.