అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండల పరిధిలోని సజ్జల కాలువ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి జయ చంద్రారెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి హుటాహుటిన వారి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.