వైసీపీ హయాంలో కాసుల కక్కుర్తితో తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో కాసుల కక్కుర్తి తో తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు.నెయ్యిలో కల్తీ జరిగిందని స్వయంగా నాటి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు. మరో వైపు జగన్ నిస్సిగ్గుగా కల్తీ జరగలేదని అబద్ధాలు మాట్లాడున్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎంతటి వారైనా తగిన మూల్యం చెల్లించక తప్పదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.