తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మామిడికుదురు నుంచి భక్తులు ఆదివారం పాదయాత్ర చేశారు. మామిడికుదురు శివాలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి ఆలయం వరకు జరిగింది. గోవిందా... గోవిందా.. అంటూ భక్తులు నామ స్మరణ చేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు.