రైలు ద్వారా అరటి ఎగుమతిని చేపట్టేందుకు తగిన సహకారం అందిస్తామని, ఎగుమతిదారులు అరటి ఎగుమతి వీలైనంత త్వరగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రైల్వే ద్వారా తాడిపత్రి నుండి జెఎన్పిటి పోర్టుకు అరటి ఎగుమతులను ప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యాన శాఖ అధికారులు, అరటి ఎగుమతిదారులు, వాటాదారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రీఫర్ కంటైనర్కు రూ.10,000/- ప్రోత్సాహకాన్ని అందించడానికి సిద్ధంగా ఉందన్నారు.