కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో గ్యారేజీలో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులను విధులనుండి అకారణంగా తరలించాలని ఆరోపిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కేశవరావు మాట్లాడుతూ... ఒప్పంద కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులకు తెలిపినప్పటికీ ఇంతవరకు వారిని విధుల్లోకి తీసుకోకపోవడం అన్యాయం అన్నారు. తక్షణం ఒప్పంద కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి ధర్నా కార్యక్రమాన్ని విరమింప చేశారు.