అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని రాప్తాడు మండలం హంపాపురం జాతీయ రహదారి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పెనుబోలు గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.