మంత్రాలయం: మంత్రాలయం రామచంద్ర కాలనీ నుంచి ఇబ్రహీంపురం గ్రామానికి వెళ్లే నల్ల వంక రహదారి మరమ్మతులు చేపట్టాలి
మంత్రాలయం లోని రామచంద్ర కాలనీ నుంచి ఇబ్రహీంపురం గ్రామానికి వెళ్లే నల్ల వంక రహదారిని ఎంపీటీసీ వెంకటేశు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు వరదరాజు, సచివాలయ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ దారి గుండా వెళ్లే ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. కాబట్టి అధికారులు స్పందించి వెంటనే ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని వారు కోరారు.