మంత్రాలయం: పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలవాలి :మంత్రాలయం మండల విద్యాధికారి రాగన్న
మంత్రాలయం:పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలవాలని మంత్రాలయం మండల విద్యాధికారి రాగన్న అన్నారు. గురువారం మంత్రాలయం మండలం రాంపురం, తుంగభద్ర గ్రామాల్లో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలను సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి పరీక్షలు రాయడం చాలా ముఖ్యమని విద్యార్థులకు సూచించారు.