నాగులుప్పలపాడు నూతన ఎస్సైగా బీవీ మహేంద్ర నాయక్ శుక్రవారం నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ లో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... నాగులుప్పలపాడు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. మండలంలో పేకాట శిబిరాలు, కోడిపందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలపై గట్టి నిఘా ఉంచుతామన్నారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలపాలని వివరాలు తెలిపిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.