కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి.ప్రతి మద్యం బాటిల్ నుంచి ఎమ్మెల్యే సురేంద్రబాబుకు రూ.30 వెళుతున్నాయని మాజీ ఎంపీ రంగయ్య తీవ్రంగా ఆరోపించారు. బ్రహ్మసముద్రం మండలం గుడిపల్లిలో శుక్రవారం కోటి సంతకాలు,రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సాయంత్రం నాలుగు గంటల సమయంలో మాట్లాడారు. ఎమ్మెల్యే సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నానని నిత్యం చూపుతూనే ఉన్నారన్నారు.సొంత డబ్బు పెట్టడం లేదన్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నారు.