గుంతకల్లు పట్టణంలోని భాగ్యనగర్ దండుమిట్ట ప్రాంతానికి చెందిన షేక్ రుక్సార్ అనే మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గుంతకల్లు వన్ టౌన్ సీఐ మనోహర్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన షేక్ రుక్సార్ అనంతపురం నగరంలోని కేకే.నగర్ కు చెందిన సయ్యద్ షాహిద్ ను ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకొని అనంతపురంలో కాపురం ఉండేవారు. అయితే ఏడాది క్రితం షాహిద్, రుక్సార్ గుంతకల్లు పట్టణంలోని భాగ్యనగర్, దండుమిట్ట ప్రాంతానికి వచ్చి బాడుగ ఇంట్లో నివాసం ఉండేవారు. గత కొన్ని రోజుల నుంచి షాహిద్ చెడు వ్యాసనాలకు బానిసై ఇంటిని పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.