ఆదర్శనగర్ బస్తీలో హైడ్రా కమీషనర్ రంగనాథ్ మంగళవారం పర్య టించారు. స్థానికంగా 30 ఏళ్లుగా మురుగునీటి సమస్యతో బాధపడుతున్నామని చెప్పుకొచ్చారు. సమస్యను పరిశీలించిన కమిషనర్ వెంటనే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పాత పైప్ లైన్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తామని, అలాగే పైనుంచి వచ్చే వరద నీటిని కూడా సాఫీగా వెళ్లేలా చూస్తామని చెప్పారు