అనంతపురం జిల్లా ఎద్దులపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఓ యువకుడికి గాయాలు
Anantapur Urban, Anantapur | Mar 29, 2026
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని పామిడి మండలం ఎద్దులపల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి అదే గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన యువకుడిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.