అనంతపురం నగరంలోని చెరువు కట్ట సమీపాన శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా రాణి నగర్ కు చెందిన నల్లమ్మ అనే మహిళను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో నల్లమ్మకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. చెరువు కట్ట సమీపాన ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.