చీమకుర్తి పట్టణంలోని శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువైన శ్రీ సరస్వతి దేవి మందిరంలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి పట్టణానికి చెందిన తల్లిదండ్రులు తమ చిన్నారులను సరస్వతి దేవి మందిరానికి తీసుకువచ్చి వేద పండితుల చేత అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిపించారు. ఈ సందర్భంగా సరస్వతి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.