2న తర్తూరు రంగనాథ స్వామి రథోత్సవం అన్ని ఏర్పాట్లు పూర్తి:
ఈవో సాయికుమార్
శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి తిరుణాల అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచినది.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తర్తూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం సా రథోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏ సాయికుమార్ అన్నారు. మంగళవారం గరుడ వాహనం,1వ తేదీ గజవాహనం,రెండవతేదీ సాయంత్రం రథోత్సవం,3వ తేదీ శుక్రవారం అశ్వవాహన సేవ పారువేట,4న వసంతోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు,ఆలయ మరియు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా అలంకరణతో తీర్చిదిద్దారు. ఈ తిరుణాల దాదాపుగా నెల రోజులపాటు జరగనుంది.ఈ జాతర అంటే ఎంతో ప్రసిద్ధిగాంచినది. సాధారణంగా అన్ని జాతరలో విగ్రహాలు,ఊరే