పెద్దపంజాణి: మండలం పోలీసు వర్గాలు శనివారం మీడియా తెలిపిన వివరాల మేరకు. చిలక పుత్తూరులో చౌడేపల్లె మండలం ఓదులపేటకు చెందిన హరినాథ్ (55) భార్యతో విడిపోయి రాయలపేటలో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. అతిగా మద్యం తాగి ఓ పాడుబడ్డ ఇంట్లో మృతిచెందాడని తెలిపారు. స్థానికుల సమాచారంతో, మృతదేహాన్ని పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.