పలమనేరు: మండల పట్టు రైతులు మీడియాతో మాట్లాడారు. సెరికల్చర్ కార్యాలయంలో అధికారులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు, బయట ప్రాంతాల్లో ఉన్న రేట్లు ఇక్కడ లేవు ఇదేంటిని ప్రశ్నిస్తే వ్యక్తిని టార్గెట్ చేస్తూ వారికి సంబంధించిన పట్టుగూళ్ళకు రేటు లేకుండా చేస్తున్నారు. ఈ విషయాలను గమనించి మేము బయట ప్రాంతంలో పట్టుగూళ్లను తీసుకెళ్లి విక్రయించుకుంటున్నామన్నారు. పట్టు రైతులను అధికారులు చిన్నచూపు చూస్తున్నారు, పై స్థాయి అధికారులు గమనించి సెరికల్చర్ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులను సిబ్బందిని బదిలీ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.