జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం పోలీస్ శాఖ చేపట్టిన “మీ మొబైల్ – మీ ఇంటికి” సేవ కార్యక్రమం జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రెండవ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల భద్రత, కనెక్టివిటీ, మరియు కమ్యూనికేషన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు వారి ఇళ్ల వద్దకే చేరవేయడం జరుగుతోంది.జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా మాట్లాడుతూ...“ప్రజల అవసరాలను గుర్తించి, వారికి సులభతరం చేసే విధంగా పోలీస్ శాఖ పనిచేస్తోంది. కమ్యూనికేషన్ అందుబాటులో ఉండటం భద్రతకు, అత్యవసర పరిస్థితుల్లో సమాచార పరస్పరానికి కీలకమన్నారు.