నాగులుప్పలపాడు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నాగులుప్పలపాడు మండలం కొత్తకోట వద్ద సోమవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తకోట వద్ద బైక్ పై వెళ్తున్న వ్యక్తిని, గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.