అనంతపురము - హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) కార్యాలయంలో ఈనెల 11వ తేదీన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ & వైస్ చైర్మన్ సి.విష్ణుచరణ్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు. ప్రతి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుండగా, దాని స్థానంలో ఈవారం బుధవారం రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో అహుడ చైర్మన్ టి.సి.వరుణ్ మరియు అహుడ సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డి, అధికారులు పాల్గొంటారన్నారు.