జిల్లా పోలీస్ శాఖ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో PGRs కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో పీజీర్స్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నుంచి 128 పిటిషన్లు స్వీకరించారు. ఎస్పీ ప్రతి పిటిషన్ను వ్యక్తిగతంగా పరిశీలించి, సమస్యల స్వరూపాన్ని మరియు తీవ్రతను తెలుసుకున్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.