కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో సోలార్ ప్లాంట్ను వ్యతిరేకిస్తూ గ్రామస్థులు సోమవారం ఉదయం 12 గంటలు పెద్ద సంఖ్యలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ హాజరై వారికి సంఘీభావం ప్రకటించారు. రైతులకు నష్టం కలిగించేలా ఉన్న ఈ సోలార్ ప్లాంట్ను అధికారులు వెంటనే తొలగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు