జేఎన్టీయూతో అమెరికా ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం చేసుకున్నాం : జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు
Anantapur Urban, Anantapur | Mar 26, 2026
అమెరికా ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంతో జేఎన్టీయూ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జెఎన్టియు ఉపకులపతి సుదర్శనరావు తెలిపారు. అమెరికా ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం చాన్సులర్ జానెట్ గూర్చ్ తో కలిసి ఆయన ఆర్యభట్ట ఆడిటోరియంలో సమావేశమై మాట్లాడారు. రాయలసీమ ప్రాంత విద్యార్థులకు, అమెరికా వెళ్లి ఎంఎస్ చేయాలనుకునే వారికి జేఎన్టీయూ మంచి అవకాశం కల్పిస్తోందన్నారు. ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ద్వారా మూడు సంవత్సరాల డిగ్రీ పట్టాతో పాటు రెండు సంవత్సరాల ఎమ్మెస్ పట్టాను జేఎన్టీయూ అమెరికా ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయాలు కలిపి ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.