ఆదోని: విద్యార్థి సంఘాలపై దురుసుగా ప్రవర్తించిన ఆదోని పోలీసులు
Adoni, Kurnool | Dec 1, 2025 ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో బీమాస్ సర్కిల్ వద్ద సోమవారం నిర్వహించిన నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోని జిల్లా కోసం ఎలాంటి త్యాగానికైనా వెనకడుగు వేయమని పలువురు నాయకులు స్పష్టం చేశారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు