పెద్దమందడి: పంటలు ఏర్పాటుకు క్షేత్ర పరిశీలన చేసి సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలి ఎమ్మెల్యే మెగా రెడ్డి
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బుద్ధారం రైట్ కెనాల్ పామిరెడ్డిపల్లి గ్రామ శివారు నుంచి దొడగుంటపల్లి, చిన్నమందడి గ్రామాలకు సాగునీరు అందించేందుకు కావలసిన పంట కాలువ ఏర్పాటుకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆయా గ్రామాల రైతులతో కలిసి క్షేత్ర పరిశీలన చేశారు ఈ కాలువ ఏర్పాటుతో పామిరెడ్డిపల్లి, ముందర తండా, చిన్నమందడి, దొడగుంటపల్లి గ్రామాలకు సంబంధించిన పలు కుంటలకు సాగునీరు చేరుతుందని దాంతో 300 పై చీలుకు ఎకరాలకు సాగునీరు అందుతుందని ఈ కాలువ ఏర్పాటుకు పెద్దమనుసుతో రైతులు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు